కేరళలో గర్భంతో ఉన్న ఏనుగుని కొందరు చంపడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. వారి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినం గా వ్యవహరించాలి అని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రముఖులు కూడా ఇప్పుడు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. 

 

కొందరు వ్యక్తులు పటాసులు నింపిన ఫైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలని ఆయన ట్వీట్ చేసారు. ఈ ఘటనపై కేంద్రం కూడా సీరియస్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: