తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 129 కరోనా కేసులు నమోదు కాగా 108 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. నిన్న నిమ్స్ ఆస్పత్రిలో ఏడు కరోనా కేసులు నమోదు కాగా తాజాగా మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. కేసుల సంఖ్య 12కు చేరడంతో నిమ్స్ సిబ్బందిలో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. 
 
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈరోజు నిమ్స్ బోర్డు అత్యవసరంగా సమావేశం అయింది. నమోదైన కేసుల గురించి, ఓపీ సేవల కొనసాగింపు గురించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా భారీన పడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 44 మంది పీజీ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని... సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: