మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్ళు మంజూరు చేసిందని... 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించిందని చంద్రబాబు అన్నారు. మరో 20.41 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని... తెలుగుదేశం "సామూహిక గృహ ప్రవేశాలు" దేశానికే నమూనా అయిందని చెప్పారు.
జగన్ సర్కార్ పేదలకు ఇళ్లస్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల స్కామ్ లు చేసిందని... ఆ భూముల్లోనే రూ. 400 కోట్ల కుంభకోణం చేశారని నిజనిర్దారణ కమిటి పేర్కొందని చెప్పారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు పేదల నుంచి వసూళ్ల దందాకు వైసీపీ తెరలేపిందని వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల స్థలం కావాలంటే రూ 30,000 రూ 60,000 రూ లక్షన్నర చొప్పున రేట్లు నిర్ణయించి వసూళ్ల దందా ప్రారంభించారని... గ్రామానికో రేటు, దగ్గర అయితే ఒక రేటు, దూరం అయితే ఇంకో రేటు వసూలు చేస్తున్నారని... పేదల సంక్షేమం లోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైసీపీదే అని చెప్పారు.
పేదల కోసం తెలుగుదేశం ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్ళు మంజూరు చేసింది. 9.10లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి 3 దశల్లో 8 లక్షల గృహప్రవేశాలు చేయించింది. మరో 20.41 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. తెలుగుదేశం "సామూహిక గృహ ప్రవేశాలు" దేశానికే నమూనా అయ్యింది. (1/5)#1YearOfMassDestruction pic.twitter.com/jH7wG2XGDI
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) June 4, 2020
ఇళ్ల స్థలం కావాలంటే రూ 30వేలు, రూ 60వేలు, రూ లక్షన్నర చొప్పున రేట్లు నిర్ణయించి వసూళ్ల దందా ప్రారంభించారు. గ్రామానికో రేటు, దగ్గర అయితే ఒక రేటు, దూరం అయితే ఇంకో రేటు వసూలు చేస్తున్నారు. పేదల సంక్షేమం లోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైసీపీదే..(5/5)#1YearOfMassDestruction
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) June 4, 2020