నెల్లూరు జిల్లా సీనియర్ నేత వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వేంకటగిరి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలోఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. 

 

జిల్లాలో నీటి లెక్కలు తప్పుల తడకలు ఉన్నాయని అన్నారు. సిఎం చెప్పినా సరే అధికారులు పట్టించుకోవడం లేదని మూడు రోజుల్లో పూర్తి సమాచారం మీడియా ముందు బయటపెడతా అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. 175 నియోజకవర్గాల్లో 174 మాత్రమే ఉన్నాయా.. వెంకటగిరి లెక్కలో లేదా.20 వేల కోట్లు నిధులు వస్తే వెంకటగిరి కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదన్నారు. స్వయంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: