దేశంలో ఎన్ని చర్యలు తీసుకున్నా సరే రేప్ ఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎన్ని విధాలుగా శిక్షలు వేస్తున్నా సరే ఎవరు చేసేది వాళ్ళు చేయడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా రాజస్థాన్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. రేప్ కి ఇద్దరు మహిళలు గత ఏడాది కాలంగా సహకరించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాజస్థాన్ పోలీసులు స్వయంగా వెల్లడించారు. 

 

బార్మెర్ శాస్త్రి నగర్లో గత ఏడాదిగా  మైనర్ అక్కా చెల్లెళ్ళను సామూహిక అత్యాచారం చేసినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు. నేరానికి పాల్పడిన ఇద్దరు నిందితులు కూడా ఇద్దరు మహిళలను సహాయం కోసం తీసుకున్నారని పుష్పేంద్ర అనే  సర్కిల్ ఆఫీసర్ మీడియాకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: