మాజీ మంత్రి అఖిల ప్రియ దుర్మార్గురాలు అంటూ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆమె ఫ్యాక్షన్ కి తెరలేపింది అంటూ ఆయన మండిపడ్డారు. తనపై హత్యాయత్నం చేసిన దానిలో ఆమె, ఆమె భర్త నిందితులుగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఆ ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.
తన ప్రాణాలకు ఏ భయం లేదని ఆమె చేసిన పనులు తాను కూడా చేయవచ్చు అని తనకు కార్యకర్తల మద్దతు ఉందని అన్నారు. పోలీసుల పై తనకు పూర్తి నమ్మకం ఉందని. భార్గవ్ ని అఖిల ప్రియ ని వెంటనే అదుపులోకి తీసుకుంటే ప్రశాంత వాతావరణం ఉంటుంది అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు.