దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కరోనా మహమ్మారి వల్ల గత రెండు నెలలు లాక్ డౌన్ వల్ల ఎలాంటి శుభ కార్యక్రమాలు జరగలేదు. ఈ మద్య లాక్ డౌన్ సడలింపుతో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్చెల్ జిల్లాలో దారుణం జరిగింది. మేడ్చల్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను 23 ఏళ్ల వాడికిచ్చి కట్టబెట్టారు. భారత దేశంలో బాల్యవివాహాలు చట్టవిరుద్దమని తెలిసిన విషయమే.. కానీ అక్కడక్కడా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా సమయంలో జరిగిన ఈ పెళ్లికి 50 మంది తగుదునమ్మా అంటూ పెళ్లి పెద్దలుగా  మూతిగుడ్డలు కూడా కట్టుకోకుండా హాజరయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

 

ఈ సందర్భంగా  బాలల హక్కుల సంఘం కార్యకర్త అచ్యుతరావ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లపోచంపల్లి సమీపంలోని కొండ్లకోయ మాతా ఆలయలంలో జూన్ 1న ఈ పనికిమాలిన పెళ్లి జరిగింది. 12వ తరగతి చదువుతున్న అమ్మాయి నెలకిందంటే పెద్దమనిషి అయిందని బాలల హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఆ అమ్మాయి మైనర్ అని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకున్న వరుడిపై, ఇద్దరి తల్లిదండ్రులపై, వారికి సహకరించిన వారిపై పక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. పెళ్లికొడుకు రాజు భవననిర్మాన కార్మికుడిగా పనిచేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: