ఒక పక్క వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నా సరే ఉగ్రవాదులు మాత్రం జమ్మూ కాశ్మీర్ లో ఆగడం లేదు. ఏదోక చర్యలకు పాల్పడుతునే ఉన్నారు. తాజాగా మరోసారి ఉగ్రవాదులను భారీ దాడులకు ప్రయత్నాలు చేసారు. జమ్మూ కాశ్మీర్ దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం ప్రాంతంలోని యారిపోరా మార్కెట్‌లో పోలీసు పార్టీపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఒక పౌరుడు గాయపడ్డాడు. 

 

భద్రతా దళాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో ఎంత మంది ఉగ్రవాదులు ఉన్నారు అనే దాని మీద పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక నిఘా వర్గాలు కూడా ఈ ప్రాంతం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో ఉగ్రవాదులను ఎరేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: