కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు దిశగా ప్రధాని నరేంద్ర మోడీ అడుగులు వేస్తున్నారు. కీలక శాఖల మార్పులపై ఆయన పార్టీ అగ్ర నేతలతో పాటుగా కేంద్రంలో  కీలక శాఖల్లో ఉన్న సన్నిహిత మంత్రులతో ఎక్కువగా చర్చిస్తున్నారు. ఇక కేంద్ర మంత్రి వర్గంలో ఈసారి యువకులకు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఆయన ఉన్నారు. 

 

కర్ణాటక నుంచి తేజస్వి సూర్య తో పాటుగా తెలంగాణా నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కి మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా అవకాశం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణా నుంచి కిషన్ రెడ్డి కేబినేట్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు కూడా అవకాశం ఇచ్చే దిశగా మోడీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: