కరోనా వైరస్కు సంబంధించి రోజురోజుకూ కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. వైరస్ పుట్టుక, వ్యాప్తి, ప్రభావం తదితర అంశాలపై జరుగుతున్న పరిశోధనల్లో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా కరోనా వైరస్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలపై ప్రభావం చూపుతోంది. అయితే.. కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ఇవి తమనుతాము పునరుద్ధరించుకునే.. అంటే తమను తాము బాగు చేసుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు.
అయితే.. ఆందోళన అంతా మెదడు గురించేనని, దాని ప్రభావం ఎలా ఉంటుందో అంతుచిక్కడం లేదని పరిశోధకులు చెబుతున్నారు జర్మనీలోని యూనివర్శిటీ మెడికల్ సెంటర్ ఆగ్స్బర్గ్ పరిశోధకులు.