దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. తాజాగా.. మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. ఢిల్లీతోపాటు పరిసర నగరాల్లో నివశిస్తున్న మెట్రోరైలు ఉద్యోగులు కరోనా బారినపడ్డారని ఢిల్లీ మెట్రోరైలు అధికారులు వెల్ల‌డించారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తాము దీనిపై పోరాడుతున్నామని ఢిల్లీ మెట్రోరైలు అధికారులు చెప్పారు. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని మెట్రోరైలు సర్వీసులు నడిపేందుకు తాము సిద్ధమని మెట్రో అధికారులు చెప్పారు.

 

ఢిల్లీ మెట్రోరైలు మస్కట్, మాస్క్, గ్లోవ్స్ ధరించిన బాలిక పోస్టర్‌ను అధికారులు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెట్రోరైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మెట్రోరైలు అధికారులు వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: