తమిళనాడులో కరోనా మహమ్మారి విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 25872 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 14316 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 208 మంది మరణించారు. తాజాగా.. ప్రజలకు ఉచితంగా మాస్క్లు అందజేసిన వ్యక్తికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది.
తంజావూర్ జిల్లా వవూసి నగర్కు చెందిన వ్యక్తి ‘మక్కల్ పాదై’ స్వచ్ఛంధ సంస్థ ద్వారా చెన్నై నగరంలో కరోనా బాధిత ప్రాంతాల ప్రజలకు ఉచితంగా మాస్క్లు అందజేశాడు. అతను తంజావూరుకు తిరిగి వెళ్లగా వైద్యపరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.