ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు దిశగా ప్రతి సంవత్సరం మద్యం షాపులను తగ్గిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచిన వారిపై, అధికారులు దృష్టి పెట్టారు. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ శంకర్‌ నాయక్‌ ఇంట్లో భారీగా మద్యం బయటపడింది. రిపోర్టర్ కర్ణాటకలో మద్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. 
 
ప్రస్తుతం రిపోర్టర్‌ శంకర్‌ నాయక్‌ పరారీలో ఉన్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో శంకర్ నాయక్ అక్రమంగా మద్యం విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఆంధ్రజ్యోతి దిన పత్రిక రవాణా వాహనంలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా బొమ్మలసత్రం రూరల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: