మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌ ప్రధాన రహదారిలో జరిగిన ఒక సంఘటన అక్కడ రోడ్డు మీద వెళ్ళే వారిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది.  అకస్మాత్తుగా రోడ్డు కుప్పకూలిపోయి పెద్దలోయ ఆ ప్రాంతంలో ఏర్పడింది. దీనితో అక్కడ ఉన్న వారు షాక్ అయ్యారు. అటు వైపు వెళ్తున్న వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో  అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

ఈ గుంత రోడ్డు సమీపంలోనే ఓ ప్రైవేట్‌ కార్పొరేట్‌ స్కూల్‌ ఉండగా... ప్రధాన రహదారి పై నుంచి 25 కాలనీలకు ప్రజలు తిరుగుతూ ఉంటారు. పది అడుగుల వెడల్పు, 14 అడుగుల లోతు ఉందని అధికారులు చెప్తున్నారు. మరో చోట కూడా ఇలాంటి ప్రమాదమే ఆ రోడ్డులో జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: