ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌తాప్‌ఘ‌ర్ వాజిద్పూర్ గ్రామ‌ స‌మీపంలో శుక్రవారం ఉదయం కంటైనర్ ట్రక్, ఎస్‌యూవీని ఢీకొన‌డంతో మొత్తం తొమ్మిది మంది మ‌ర‌ణించారు. ఇందులో ఇద్ద‌రు మైన‌ర్లు  ఉన్నారు. మృతదేహాలను బయటకు తీసుకురావడానికి గ్యాస్ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చింది. ఎస్‌యూవీ డ్రైవర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు రాజస్థాన్ నుంచి బీహార్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన‌ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: