ఈ నెల 9 నుంచి మూడో దశ వందే భారత్ మిషన్ కార్యక్రమం మొదలవుతున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు విదేశాల్లో ఉండే వారు భారత్ కి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మూడో దశలో భాగంగా యూఏఈ నుంచి మరో 25 రిపాట్రియేషన్ విమానాలను నడిపిస్తారు.
ఈ నెల 9 నుంచి 19 వరకు నడవనున్న మొత్తం 25 విమానాలు ఒకసారి చూస్తే 14 అబుధాబి, మరో 11 దుబాయి మహారాష్ట్రకు ప్రత్యేక విమానం కేరళలోని నాలుగు విమానాశ్రయాలకు 10 విమానాలు వస్తాయని కేంద్రం చెప్పింది. చెన్నై బెంగళూరుతో పాటుగా హైదరాబాద్ నగరాలకు విమానాలు వస్తాయి. న్యూఢిల్లీ, శ్రీనగర్, చండీగఢ్, అమృత్సర్, జైపూర్, లక్నో వస్తాయని కేంద్రం చెప్తుంది.