శుక్రవారం ఉదయం దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. స్వల్పంగా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో కూడా భూమి కంపించింది. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది అని అధికారులు చెప్పారు. 

 

గద్దలగుంట, మామిడిపాలెం దేవుడి చెరువు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీనితో కంగారు పడిన ప్రజలు ఇళ్ళ నుంచి బయటకువచ్చారు. అయితే రిక్టర్ స్కేలు మీద ఎంత నమ్దోహు అయింది అనేది ఇంకా స్పష్టత లేదు. భూకంప కేంద్రం గురించి స్పష్టత రాలేదు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు అని అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: