తెలుగు రాష్ట్రాల్లో మహిళా వైద్యులపై వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. నిన్న తెలంగాణాలో ఒక మహిళా డాక్టర్ ని వైద్య అధికారి వేధించిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో కూడా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత మహిళా డాక్టర్‌‌ ను సోషల్ మీడియాలో వేధిస్తున్నారు. 

 

వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌గా పని చేస్తున్న జ్యోతిర్మయి డాక్టర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెట్టడంతో అధికారులు కేసు నమోదు చేసారు. ఎన్జీవో నాయకుడినంటూ ఎంపీహెచ్‌ఏ శ్రీరాములు తనను బెదిరిస్తున్నాడని జ్యోతిర్మయి అధికారులకు ఆమె ఫిర్యాదు చేసారు. పోస్ట్ లు ఎవరు ఎవరు పెట్టారు అనే దాని మీద కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: