విశాఖలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ విషాద ఘటన లోని బాధితులు ఇంకా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఘటనలు ఎన్నో మూగజీవాలు చనిపోగా 14 మంది ప్రాణాలు సైతం కోల్పోయారు.. 

 


 ఇక తాజాగా ఎల్జి పాలిమర్స్ కంపెనీ ముందు మానవ హారానికి సిద్ధమయ్యారు సిపిఎం నేతలు ప్రజా సంఘాలు. వెంటనే ఎల్జి పాలిమర్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలించి విశాఖను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో విశాఖలోని గోపాలపట్నం లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రసన్న తెలిపినందుకు వచ్చిన వారిని వచ్చినట్లుగానే అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: