ఆంధ్రప్రదేశ్లో వరుస ఘర్షణలు కలకలం రేపుతున్నాయి. నిన్నటికి నిన్న విజయవాడ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఘర్షణల్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ క్రికెట్ గ్రౌండ్ లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. క్రికెట్ మైదనాల్లోనే ఎందుకీలా ఘర్షణలకు పాల్పడుతున్నారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారా..? లేక ఆటలో అనుకోకుండా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.