దేశంలో ఓ వైపు కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చాలా మంది ఇంటి పట్టున ఉంటున్నారు.  ఈ మద్య లాక్ డౌన్ సడలించినప్పటి నుంచి ఉద్యోగస్తులు, చిరు వ్యాపారులు బయటకు వస్తున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇంటి పట్టున ఉంటా తాము చేస్తున్న వంటకాలు, వ్యాయామాలు, యోగా ఇలా ఎన్నో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సాధారణంగా మన దేశంలో పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఉండరు.  చల్లగా గుటుక్కున మింగే పానీ పూరీ తెలుగు రాష్ట్రాల్లో గప్ చుప్ అంటారు.  మరికొన్ని రాష్ట్రాల్లో గోల్ గప్పా అంటారు.  ఏది ఏమైనా దీని రుచికి ఫిదా కాని వారు ఎవరూ ఉండరు. 

 

లాక్ డౌన్ పుణ్యమా అని జనాలు పానీ పూరికి దూరమయ్యారు. రోడ్డుమీద పానీ పూరి బండి కనిపిస్తే చాలు వారు శుభ్రత పాటిస్తున్నారా లేదా అని పట్టించుకోకుండా ఎంతో అపురూపంగా వారి  చేతితో ఇచ్చిన పానీపూరి అందుకొని నోటిలో పెట్టికొని ఆస్వాదిస్తూ తింటారు. దహీపూరి, మసాలా పూరీలకన్నా పానీపూరికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.  అంతగా ఇష్టపడే పాని పూరి పానీపూరిని ఓ వ్యక్తి కూనీ చేశాడు. అంటే.. అందులో ఆలూ, బఠానీల స్టఫ్ పెట్టకుండా మ్యాగీన్యూడిల్స్‌ పెట్టి సో టేస్టీ అంటున్నాడు. ఈ ఫొటోను చూసిన పానీపూరి అభిమానులు కామెంట్ల రూపంలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: