ఈ మధ్యకాలంలో మద్యం అక్రమ రవాణా బాగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ చెక్పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు కూడా తీసుకున్నారు అధికారులు. ఇక తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో  భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బయటపడింది.


పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై సిహెచ్ స్వామి మరియు వారి యొక్క సిబ్బంది తో లింగగూడెం చెక్ పోస్ట్ వద్ద  తనిఖీ లు నిర్వహించుచుండగా  తెలంగాణ రాష్ట్ర వైపు నుండి వాహనముల పై  ఏలూరు వైపు  అక్రమంగా తరలిస్తున్న 97 మద్యం బాటిల్స్ 4 వాహనములు మరియు 7 గురు వ్యక్తులను చింతలపూడి యస్. ఐ గారు  అదుపులోకి తీసుకుని వారిపై   కేసు నమోదు చేసి మద్యము బాటిల్స్ ను స్వాధీన పరచు కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: