జనవాడలోని  కేటీఆర్ ఫామ్ హౌస్ పై  కొన్ని కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత,  వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి... మొదటి నుంచి జనవాడ లో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ అక్రమంగా నిర్మించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఫాంహౌస్ పైన డ్రోన్ కెమెరాలు పంపించిన ఈ కేసులో ఏకంగా  జైలుకు కూడా వెళ్ళి వచ్చారు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదు రేవంత్ రెడ్డి. 

 


 జన వాడ లో కేటీఆర్ ఫామ్ హౌస్ చట్ట విరుద్ధంగా నిర్మాణం  జరిగింది అంటూ ఎన్జీటీ లో  పిటిషన్ వేశారు మల్కాజ్గిరి ఎంపీ కాంగ్రెస్ కీలక నేత రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎన్జీటీ  జనవాడ లోని  కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణంపై నోటీసులు పంపింది. ఎన్జీటీ  న్యాయమూర్తి రామకృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఈ మేరకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: