కెరీర్ మొదలు పెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న అందాల ముద్దుగుమ్మ పూజ హెగ్దే. అల వైకుంఠపురం లో సక్సెస్ అవ్వడంతో మంచి ఫామ్ లో ఉంది నటి, అయితే లోక్ డౌన్ వేళ క్వారంటైన్ లో ఉంటున్న పూజ తన క్వారంటైన్ అప్డేట్ లను పంచుతూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంది. ఎక్కువ శాతం తాను క్వారంటైన్ లో యోగ చేస్తూ కనిపించింది అదేవిధంగా ఎప్పుడు చేయని వంటలను చేయడానికి తన ఇష్టాన్ని తెలియజేసింది.
గతం లో లాక్ డౌన్ ఎత్తివేస్తే తాను ఏమేమి చేయాలనుకుంటుందో చెప్పింది. తన నిర్బంధ సమయంలో తనతో తన అమ్మమ్మ గడిపిన మధుర క్షణాలను గుర్తుకు చేసుకుంటూ ఆనందించింది పూజ . అయితే అప్పుడు తన అమ్మమ్మతో కలసి దిగిన ఫోటోను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఆ ఫోటోను షేర్ చేస్తూ నా బంగారం అంటూ సంబోధిస్తూ పోస్ట్ పెట్టింది. ఆమె ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ లో పెట్టిందో లేదో దాదాపుగా ఆరు లక్షలకు పైగా లైక్ లు వచ్చాయి.
.@hegdepooja is spending time with her #ajji in her quarantine period.#poojahegde pic.twitter.com/n6HEBbRJIc
— box office india (@boxofficeindia) June 4, 2020