కేరళలోని మల్లాపురంలోకి గర్భంతో ఉన్న ఏనుగు రావడంతో కొందరు ఆకతాయిలు దుర్మార్గంగా ఆలోచించి క్రాకర్లను ఓ పైనాపిల్‌లో కుక్కి నిప్పు పెట్టారు. దాన్ని ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్లు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు... ఆ పైనాపిల్‌ను నోట్లోకి తీసుకుంది. అంతే.. భారీ శబ్ధంతో పేలింది. మానత్వం మరిచి పోయిన ప్రవర్తించిన ఈ మూర్ఖులకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు. కేరళలో గర్భిణీ ఏనుగు మృతికి కారకుడైన ఒకరిని అరెస్టు చేసినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను గుర్తించినట్లు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించిన ఒక రోజుల తర్వాత ఈ అరెస్టు జరిగింది.

కేరళలోని మలప్పురంలో ఓ ఆడ ఏనుగును కొందరు దారుణంగా చంపిన ఘటనపై ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. తల్లి ఏనుగు కడుపులో గున్న ఏనుగుతో పలువురు వేసిన కార్టూన్లు హృదయాన్ని ద్రవించజేసేలా ఉన్నాయి.  చనిపోయిన ఆడ ఏనుగు, దాని కడుపులోని పిల్ల బాధలను ఈ కార్టూన్లు కళ్లకు కడుతున్నాయి. తల్లి ఏనుగు, గున్న ఏనుగుకు సంబంధించిన ఈ కార్టూన్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: