తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాల పై సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నందున కేవలం కొన్ని పథకాలకు మాత్రమే నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటూ తాజాగా మీడియా సమావేశంలో వెల్లడించారు నిర్మల సీతారామన్. ఈ క్రమంలో గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ.. ఆత్మ నిబ్బరం అభియాన్ ప్యాకేజీలకు మాత్రమే నిధులు కేటాయిస్తామని నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. 

 


 అంతేకాకుండా ప్రస్తుతం కరోనా  వైరస్ ప్రభావం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అయిన నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఎలాంటి కొత్త పథకాలను ప్రారంభించే యోచనలో కేంద్ర ప్రభుత్వం లేదు అని నిర్మలాసీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా  వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇతర పథకాల పై ఖర్చులు తగ్గించే క్రమంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త పథకాలకు సంబంధించిన నిధుల కోసం కేంద్రానికి అభ్యర్థనలు  పంపవద్దు అంటూ అన్ని శాఖలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు నిర్మల సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: