ఆంధ్రప్రదేశ్ లో ఎల్జీ పాలిమర్స్ వివాదం ఏ స్థాయిలో దుమారం రేపుతుంది అనేది అందరికి తెలిసిందే. ఇక ఇది రాజకీయ దుమారం రేపడంతో ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా వెళ్తాయి అనే ఆసక్తి అందరిలో కూడా నెలకొంది. ఇక ఇప్పుడు అక్కడ కంపెనీ ఉంచవద్దు అని విపక్షాలు తీవ్ర స్థాయిలో డిమాండ్ చేస్తున్నారు. 

 

ఇది పక్కన పెడితే తాజాగా వామపక్షాలు కంపెనీ ని అక్కడ ఉంచవద్దు అని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగాయి. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద నిరసన తెలపడానికి వెళ్తున్న వామపక్షాల కార్మికులను విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు మాట్లాడుతూ "నిరసనకు అనుమతి తీసుకోనందున మేము వారిని అరెస్టు చేసామన్నారు. 96 మంది వామపక్ష పార్టీ నేతలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: