కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో ఇన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వేడెక్కింది. ఏవీ సుబ్బారెడ్డి  చేస్తున్న వ్యాఖ్యలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ప్రధాన ఇబ్బంది గా మారింది. అఖిల ప్రియ తనను చంపాలి అని కుట్ర చేసింది అంటూ ఏవీ సుబ్బారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

 

ఇక ఇప్పుడు జిల్లాలో కొందరు టీడీపీ నేతలు కూడా అఖిల ప్రియ తీరు మీద అసహనంగా ఉన్నారు. అఖిల ప్రియ దూకుడు స్వభావం ఉన్న నేత అని దానితో పార్టీ తీవ్రంగా ఇబ్బంది పడుతుంది అని నేతలు ఆవేదన వ్యక్త౦ చేస్తున్నారు.  కొందరు నేతలు ఆమె వైఖరి నచ్చక పార్టీ మారే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: