చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత ఘటన జరిగింది. మండలంలోని రాజుపేట గ్రామంలో పొలం పనులు చేస్తున్న రైతుల మీద పోలీసులు దాడి చేసారు. దాడి చేసి వారి వద్ద ఉన్న నగదుతో పాటుగా వాహనాలను కూడా లాక్కుని వెళ్ళారు. కర్ణాటక సరిహద్దు కావడంతో అటు నుంచి వచ్చిన పోలీసులు ఈ దాడికి తెగబడ్డారు. 

 

అదే విధంగా తుపాకులతో రైతులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదుని కూడా లాక్కోవడమే కాకుండా వారిని బెదిరించి ఆన్లైన్ లో ఉన్న నగదుని కూడా బదిలీ చేయించుకున్నారు. దీనితో రైతులు పరుగులు తీసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇక అప్పటికే కర్ణాటక పోలీసులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .

మరింత సమాచారం తెలుసుకోండి: