మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. తనని తాను నాస్తికుడిగా ప్రకటించుకున్న మెగాబ్రదర్ నాగబాబు... స్వామీజీలు బాబాల పై ఎప్పుడూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ సంచలనం రేపుతున్నారు.
ఇక తాజాగా మరో ఆసక్తికర కామెంట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు మెగా బ్రదర్ నాగబాబు. నాగబాబు పెట్టిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. స్వామీజీలు బాబాజీ లు ఆల్రెడీ మఠాలనో ఆశ్రమాలనో నిర్వహిస్తున్నారు. గరికపాటి చాగంటి గీతా గంగాధర్ సామవేదం లాంటి వ్యక్తులు ప్రస్తుతం హిందువుల అందరి మన్ననలు పొందుతున్నారు. సో ఇలాంటి వాళ్లే కరెక్ట్ అని నా ఫీలింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు మెగా బ్రదర్ నాగబాబు. ఇక దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తూ సరిగ్గా చెప్పారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Contd pic.twitter.com/qQqnn8RODJ
— naga Babu konidela (@NagaBabuOffl) June 6, 2020