విజయవాడ గ్యాంగ్ వార్ లో ఇప్పుడు పోలీసులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ గ్యాంగ్ వార్ లో కీలకంగా మారిన  కొందరి మీద పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే పండు సహా 13 మందిని పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. పరారీ లో ఉన్న సందీప్ గ్యాంగ్ లో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో  పండు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అతని చేతికి తీవ్ర గాయమైనట్టు తెలుస్తుంది. ఇక అతనిపై ఇప్పటికే రౌడీ షీట్ ని కూడా పోలీసులు ఓపెన్ చేసారు. అతని వద్దకు తల్లిని మినహా ఎవరిని కూడా అనుమతించడం లేదు పోలీసులు. కుటుంబ సభ్యులను కూడా ఆస్పత్రిలోకి రావొద్దు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: