ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డాక్టర్ డీ రామానాయుడు జయంతి సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియా వేదికగా ఆయనను స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నేమరవేసుకున్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనతో కలిసి ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. 

 

"రాజా ...!" అంటూ మీరు పిలిచే పిలుపులో ఆత్మీయత చవి చూసానని పేర్కొన్నారు. కారంచేడు నుంచి ఓ కుర్రాడు, దేశం గర్వించేలా అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించటమే కాదు...నిర్మాతగా ప్రపంచ రికార్డు నెలకొల్పటం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. సినిమా అంటే మీకున్న ప్రేమ, మీరు చేసిన సేవలు ఈ తరానికి చిరస్మరణీయమని కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: