కేరళలో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. అక్కడ రోజు 80 నుంచి వంద కేసుల వరకు నమోదు అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కేరళలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. కేరళలో కరోనా కేసులకు సంబంధించి కాసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 

 

నిన్న ఒక్క రోజే అక్కడ వందకు పైగా కేసులు నమోదు అయ్యాయి. 108 కొత్త కేసులు రావడంతో మొత్తం 1029 కేసులు నమోదు అయ్యాయి అని కేరళ వైద్య ఆరోగ్య శాఖ తన ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ కేసులు అన్నీ కూడా ఎక్కువగా నమోదు అయ్యేది మూడు జిల్లాల్లోనే అని కేరళ ప్రభుత్వం చెప్తుంది. ఇక మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: