తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది గాని తగ్గడం లేదు. అక్కడ రోజు రోజు కి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసుల తీవ్రత చాలా అధికంగా ఉంది. తాజాగా తెలంగాణా సీఎం కార్యాలయంలో కరోనా కేసు బయటపడింది. 

 

మెట్రో రైల్‌ భవన్‌లో పనిచేస్తున్న సీఎంవో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తేల్చారు. ఇటీవలే మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు హైదరాబాద్‌కు వచ్చాడు అని అధికారుల విచారణలో వెల్లడి అయింది. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి కరోనా సోకిందని అధికారులు పేర్కొన్నారు. దీనితో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అధికారులు మూసి వేసారు. ఆ అధికారులతో సంబంధాలు ఉన్న అందరికి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: