చంద్రబాబు పై టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. ఆ పార్టీ లో పట్టుమని 10 మంది కూడా మిగలరని ఎద్దేవా చేశారు. ఐతే ఇంత జరుగుతున్నా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి బుధ్ధి రావడం లేదని మండి పడ్డారు. తాము వైఎస్ ఆర్ లో కొనసాగుతున్నందుకు గర్వంగా ఉంది అని చెప్పారు. అదేవిధంగా వైఎస్ జగన్ నేతృత్వం లో పనిచేయడం చాల సంతోషంగా ఉందని చెప్పాడు.

 

కరోనా ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం చిత శుద్దితో పనిచేస్తున్నట్లు అయన తెలిపారు. జగన్ పరిపాలనలో ప్రజలు చాల సంతోషంగా ఉన్నారని అయన తెలిపాడు. జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని అయన దుయ్యబట్టారు.  ఇక  తమ వినుకొండ నియోజకవర్గానికి ఇసుక రావడంలో ఆలస్యం అవుతుందని తాను చెప్పానని, అయితే ఈ విషయాన్నీ  ఎల్లో మీడియా భూతద్ధంలో చూపిస్తోందని ధ్వజమెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: