తెలంగాణా లో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్యా విపరీతంగా పెరుగుతూ ఉంది. శనివారం తెలంగాణ లో ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 206 కేసులు నమోదు అయ్యాయి. మరియు 10 మంది మరణించారు. దింతో తెలంగాణ లో ఇప్పటివరకు ఉన్న కరోనా కేసుల సంఖ్యా 3,496కు చేరింది. తాజాగా సంభవించిన 10 మరణాలతో కలపి 123 మరణాలుగా నమోదు అయ్యాయి. తెలంగాణ మొత్తం మీద ఇప్పటి వరకు 1,710 మంది డిశ్చార్జ్‌ కాగా, ప్రస్తుతం 1,663 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

 

కొత్తగా వచ్చిన 206 పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా 152 కేసులు జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో మేడ్చల్‌లో 18, రంగారెడ్డిలో 10, యాదాద్రిలో 5,  నిర్మల్‌లో 5, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాలలో 2, నాగర్‌ కర్నూల్‌లో 2, వికారాబాద్‌లో 1, మహబూబాబాద్‌లో 1, జనగామలో 1,  గద్వాల్‌, నల్లగొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాలలో ఒక్కో కేసు నమోదైనట్లు తెంలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: