మహారాష్ట్రలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 2,739 కేసులు నమోదయ్యాయి. దీంతో శనివారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 82,968 కు చేరుకుంది. రాష్ట్రంలో కొత్తగా 120 మరణాలు నమోదయ్యాయి. ఇందులో ఇందులో 78 మంది పురుషులు, 42 మంది మహిళలు ఉన్నారు. మరణించిన వారిలో సగానికి పైగా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి.
దీంతో మరణాల సంఖ్య 2,969కు చేరుకుంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో కొత్తగా 58 మంది మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు నగరంలో ఒక్కరోజులో సంభవించిన మరణాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.