రాజస్థాన్ కి మిడతలు చుక్కలు చూపిస్తున్నాయి. లేదు అనుకున్న  బెడద... ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ రాష్ట్రానికి రావడంతో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. తాజాగా రాజస్థాన్ లోని కొన్ని గ్రామాల్లో భారీగా మిడతలు కనిపించాయి. బార్మర్ జిల్లాలోని అనేక గ్రామాల్లో మిడుతలు కనిపించాయి. 

 

వారిని భయపెట్టడానికి స్థానికులు పాత్రలను మోగించారు. రైతులు మాట్లాడుతూ... మేము ఇలాంటి నష్టాలను ఎదుర్కొంటున్నాము. ప్రభుత్వం మాకు కొంత సహాయం అందించాలని కోరారు. వర్షం పడినప్పుడు మేము విత్తనాలు విత్తడం ప్రారంభించామని... కాని ఇప్పుడు మిడుతలు ఇక్కడ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో మిడతల ప్రభావం కాస్త తగ్గింది అని అధికారులు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: