బీహార్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఎలా అయినా సరే జేడియు తో కలిసి అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని బిజెపి భావిస్తుంది. ఇక కరోనా ఉన్నా సరే ఎన్నికల ప్రచారాన్ని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించడానికి సిద్దమయ్యారు. అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్, ఫెస్ బుక్ లైవ్ ద్వారా ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైశ్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 

 

ఈ కార్యక్రమానికి 243 అసెంబ్లీ స్థానాల్లోని లక్ష మంది ప్రజలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు బిజెపి నేతలు. ఆ పార్టీకి జేడియు తో పాటుగా జన శక్తి పార్టీ కూడా కూటమిలో ఉన్న సంగతి తెలుస్తుంది. 225కు పైగా సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని బిజెపి నేతలు చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: