భార‌త్‌లో క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. గ‌త 24గంట‌ల్లో ఏకంగా 9971 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 287 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా కేసులు 2.46ల‌క్ష‌ల‌కు చేరుకోగా.. 6,929 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

 

అయితే.. కేవ‌లం నాలుగు రాష్ట్రాల్లో నే అత్య‌ధిక కేసులు న‌మోదు అవుతున్నాయి. మ‌హారాష్ట్రంలో 82,968కేసుల‌తో టాప్‌లో ఉంది. ఆ త‌ర్వాత తమిళనాడు (30,152), ఢిల్లీ (27,654), గుజరాత్ (19,592) ఉన్నాయి. దేశ‌వ్యాప్తంగా 1.2 లక్షలు యాక్టివ్  కేసులు కాగా, 1.19 లక్షలమంది కోలుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: