ఒక పక్క కరోనా రాకుండా సామాజిక దూరం పాటించాలి అని ఎంత మంది చెప్పినా సరే చాలా మంది దాన్ని లైట్ తీసుకుంటూ ఉంటారు.  కేసులు పెరుగుతున్నా సరే జనాల్లో మాత్రం మార్పు అనేది రావడం చాలా కష్టంగా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. దేశ వ్యాప్తంగా కూడా సామాజిక దూరం కి సంబంధించి చాలా మంది లైట్ తీసుకుంటున్నారు. 

 

తాజాగా రాజస్థాన్ లో ఒక ఘటన జరిగింది. మహమ్మారి మధ్య, మహారాణా ప్రతాప్ విగ్రహం ప్రారంభోత్సవానికి బారన్లోని ప్రతాప్ చౌక్ వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడడంతో సామాజిక దూర నిబంధనలు ఉల్లంఘించారు అని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పనాచంద్ మేఘవాల్ కూడా పాల్గొన్నారని అధికారులు మీడియాకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: