అంతరాష్ట్ర సర్వీసులను నడపడానికి గానూ ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసి సిద్దంగా ఉంది. ఆర్టీసి బస్సులను నడపడానికి ప్రభుత్వ అనుమతి కోసం ఆర్టీసి చూస్తున్నట్టు తెలుస్తుంది. రేపటి నుంచి అంతరాష్ట్ర సర్వీసులను నడపడానికి గానూ  కేంద్ర సర్కార్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎలా అయినా సరే బస్సులను నడపాలి అని అధికారులు పట్టుదలగా ఉన్నారు. 

 

ఇప్పటికే కర్ణాటక తమిళనాడు తెలంగాణా ఓడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లేఖలు కూడా రాసింది. ఆయా రాష్ట్రాల నుంచి ఇంకా అనుమతి మాత్రం రాలేదు. ఇక తెలంగాణా ఇప్పటికే ఏపీ వారిని రాష్ట్రంలోకి రావడానికి గానూ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: