జమ్ము కాశ్మీర్ లో ఉగ్రవాదులను భారత బలగాలు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. గత నెల రోజులుగా వరుస దాడులకు దిగుతుంది భారత ఆర్మీ. నేడు మరో ముగ్గురు ఉగ్రవాదులను  టార్గెట్ చేసి కాల్చి చంపింది భారత ఆర్మీ. షోపియన్‌లోని రెబాన్ ప్రాంతంలో 3 గుర్తు తెలియని ఉగ్రవాదులను కాల్చి చంపామని ఆర్మీ ప్రకటించింది. 

 

ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని భారత బలగాలు పేర్కొన్నాయి. జమ్మూ & కే: జైనాపోరాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, రాష్ట్రీయ రైఫిల్స్ & స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ యొక్క 178 బెటాలియన్ సంయుక్త దళాలు షోపియన్‌లో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు తారస పడటం తో దళాలు & ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: