తెలంగాణా సిఎం కేసీఆర్ రేపు సాయంత్రం 4;30 నిమిషాలకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ప్రగతి భవన్ లో పదో తరగతి పరిక్షలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం కరోనాపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.  ఈ సమావేశంలో లాక్ డౌన్ పై సమీక్ష నిర్వహించే సూచనలు కనపడుతున్నాయి. 

 

ఇక అంతరాష్ట్ర బస్ రవాణా విషయంలో ఆయన నుంచి ఏదోక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడతారు. దీనికి మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ పై ఆయన నుంచి ఏదోక కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. హైదరాబాద్ ని షట్ డౌన్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: