ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటి భేటీ జరుగుతుంది. ఈ కమిటి ముందు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాదం జరిగిన తీరుని వాళ్ళు కమిటీ కి వివరించారు. అదే విధంగా కంపెనీ లో తీసుకుంటున్న భద్రత రక్షణ ప్రమాణాలను ప్రతినిధులు కమిటీ ముందు వివరిస్తున్నారు. 

 

ఇక స్థానికులతో కూడా కమిటీ సభ్యులు మాట్లాడారు. ఉదయం బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఒక బాధితుడి భార్య కమిటి ముందు సోమ్మ సిల్లి పడిపోవడం సంచలనంగా మారింది. మూడు రోజుల పాటు ఈ కమిటీ విచారణ జరుగుతుంది. దీనితో కంపెనీ వద్ద భారీ భద్రతను కూడా విశాఖ పోలీసులు ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: