ఇటీవల సినీ పరిశ్రమపై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోవద్దు అన్నారు నటుడు పోసాని కృష్ణ మురళి. ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు. బాలకృష్ణ ఆవేశంగా మాట్లాడతారు అని ఆయనది ఆవేశం మాత్రమే అని అన్నారు. ఆయన ఆవేశం సమాజానికి మంచిది కాదన్నారు పోసాని. 

 

ఇక రెండు రాష్ట్రాల సిఎంలపై కూడా ఆయన మట్లాడారు. కేసీఆర్ చెప్తే జగన్ వింటారు అని అన్నారు. తాను మాట్లాడింది ఒకరిని పొగడటానికో మరొకరిని తిట్టాడానీకో కాదన్నారు ఆయన. కేటిఆర్ రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ నేతలు అనడంపై పోసాని స్పందించారు. మంత్రిపై విమర్శలు చేసి రాజీనామా చేయమనడం ఏంటీ అన్నారు ఆయన. ప్రతిపక్ష పార్టీ ఒక పార్టీని మిత్రపక్షంగా చేసుకుని పని చేస్తుందని వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: