టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలు కనపడుతున్నాయి. త్వరలోనే ఐపిఎల్ నిర్వహణ విషయంలో ఏదోక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటన పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి సానుకూల ప్రకటన వచ్చినా అదే విధంగా టి20 ప్రపంచ కప్ విషయంలో ఐసిసి నుంచి ఏదైనా సానుకూల ప్రకటన వచ్చినా సరే అతను క్రికెట్ లో కొనసాగే అవకాశం ఉందని..
ఈ ఏడాది గనుక ఈ రెండు లేకపోతే మాత్రం అతను క్రికెట్ నుంచి తప్పుకోవడం ఖాయమని ఇప్పుడు వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అతను ప్రస్తుతం దాదాపుగా ప్రాక్టీస్ కూడా మానేసాడు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ధోని క్రికెట్ భవిష్యత్తు ఆసక్తికరంగా మారింది.