విజయవాడ గ్యాంగ్ వార్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. విజయవాడ గ్యాంగ్ వార్ లో చాలా మంది హస్తం ఉందని పోలీసులు గుర్తించారు. గ్యాంగ్వార్లో పాల్గొన్నవారి సెల్ఫోన్ డేటాను పోలీసులు సేకరించి కీలక సమాచారాన్ని సంపాదించారు. మాజీ రౌడీషీటర్ లారా బావమరిది, మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు.. గ్యాంగ్వార్లో కీలక పాత్ర పోషించారు అని అధికారులు అంటున్నారు.
వాళ్ళను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఒక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రౌడీషీటర్ హేమంత్ సోదరుడు కిరణ్ పాత్రపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు విజయవాడకు చెందిన కొందరు డిగ్రీ విద్యార్ధుల పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సందీప్పై పటమట స్టేషన్లో 13 కేసులున్నాయి. రౌడీషీట్ను ఇటీవలే మూసి వేసారు.