మహానటి సావిత్రి గారి జీవిత కథాంశంతో సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ సినిమాలో మహానటి సావిత్రిగా కీర్తి సురేష్ ఆమె ఆహార్యం తో నటించి మెప్పించారు. ఈ సినిమా విడుదలైన ప్రతి చోట మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి ఇది రెండో సంవత్సరం కావస్తు ఉండడంతో ఈ సినిమాలో నటించిన తారలను మల్లి ఓ వేదికమీదకు తీసుకురావాలనుకుంటున్నాడు ప్రముఖ సినీ విశ్లేషకుడు మరియు విమర్శకుడు రాజీవ్ మసాన్డ్.

 

ఈ సిమ్లాలో నటించిన నటులు  కీర్తి సురేష్  ,  దుర్క్యూర్ సలీమాన్, డానీ శాంచెజ్-లోపెజ్  , స్వప్న దత్త్ చలసాని, ప్రియాంక దత్త్, నాగ్ అశ్విన్ మొదలగు నటి నటులతో సోషల్ మాధ్యమం ద్వారా ముచ్చటించనున్నారు. ఈ చర్చకు సంబందించిన వీడియో ను రేపు ట్విట్టర్, ఫేస్బుక్ మరియు ఇతర మాధ్యమాల ద్వారా ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం ఈ చర్చకు సంబంధించి ఓ ట్రైలర్ వీడియోను ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: