మనం చిన్న పిల్లల విషయంలో ఏ చిన్న అజాగ్రత్త వహించిన మృత్యువడిలోకి వెళ్తుంటారు. ఇందుకు బోరు బావిలో చిన్నపిల్లలు పడి చనిపోవడమే ఉదాహారణ. అయితే తల్లిదండ్రులు చిన్న పిల్లల విషయంలో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉన్నా కొన్ని సార్లు మాత్రం పిల్లు చేసే పొరపాటు వల్ల చనిపోతుంటారు. తాజాగా నీటిసంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేటలో ఆదివారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుల్జారావుపేటకు చెందిన గూగులోతు భిక్షపతి ప్రమీల దంపతుల కుమారుడు అభిరామ్(4). తండ్రి పొలం పనికి వెళ్లిన అనంతరం తల్లి ఇంట్లో పని చేస్తుండగా అభిరామ్ ఆడుకుంటు వెళ్లి నీటిసంపులో పడ్డాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న బాబు కనిపించపోవడంతో తల్లి కంగారు పడింది. తర్వాత తల్లి ఎంత పిలిచినా బాలుడు పలుకకపోవడంతో అంతా వెతకగా నీటిసంపులో పడిఉన్నాడు. దీంతో తల్లి బోరున విలపిస్తూ చుట్టు పక్కన వారిని పిలిచింది. వారు బాలుడిని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు.